సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం
అమెరికాలో వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాలు
03 Sep 2015 7:42 PM
హైదరాబాద్: వైఎస్సార్సీపీ అమెరికా ఎన్ ఆర్ ఐ కమిటీ ఆధ్వర్యంలో దివంగత మహానేత వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్సార్ అభిమానులు పలు సేవ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాల్ని వైఎస్సార్సీపీ అమెరికా ఎన్ ఆర్ ఐ కమిటీ సమన్వయ పరిచింది. ఈ సందర్బంగా రాజన్న చేసిన సేవల్ని పలువురు గుర్తు చేసుకొన్నారు.
సాత్విక్ రెడ్డి గోగుల మూడి, సందీప్ భీమిరెడ్డి, స్వరూప్ శిలాస్, సందీప్ రెడ్డి వౌకంట్, రవి తేజ రెడ్డి ఆధ్వర్యంలో న్యూ జెర్సీ లో ఆహార పంపిణీ, రక్త దానం కార్యక్రమాలు చేపట్టారు. సెంట్ న్యూ బ్రూన్స్ విక్ లో ఆహార పంపిణీ చేపట్టారు. ఆదిత్య రెడ్డి, రోహిత్ గంగిరెడ్డి, దిలీప్ దొండపాటి, పృథ్వి ప్రవీణ్, ప్రేమ్ కుమార్, శివకుమార్, యశ్వంత్, కరుణ్, జగదీష్ ఆధ్వర్యంలో నోబుల్ మనార్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో సేవ కార్యక్రమాలు చేపట్టారు. క్రాఫ్ట్ మెటీరియల్ పంచి పెట్టారు. ఫోనిక్స్ అరిజోనా టీమ్ గౌతమ్ తదితరుల ఆధ్వర్యంలో ఆహార పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమాల్ని వైఎస్సార్సీపీ అమెరికా ఎన్ ఆర్ ఐ కన్వీనర్లు రత్నాకర్, మధులిక, గురవారెడ్డి, రాజశేఖర్ తదితరులు సమన్వయ పరిచారు.