తెలుగు వారి ఇంటా సంతోషాలు నింపాలి

హైదరాబాద్‌: కొత్త హేవిళంబి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారి ఇంటా సంతోషాలు నింపాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు. తెలుగు ప్రజలకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగు సంవత్సర తొలి పండుగ..అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు సమాజంలో ప్రతి ఒక్కరూ, అన్ని వర్గాల ప్రజలు ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్థిల్లాలని వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. సకాలంలో వర్షాలు కురవాలని,  రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రైతులు వర్థిల్లాలని, పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని కోరారు. షడ్రుచుల ఉగాది తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నింపి, ఆనందం తీసుకురావాలని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు.

Back to Top