కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఎమ్మెల్యేలు సీకే బాబు, కారుమూరు చేరిక
10 Apr 2014 2:03 PM
హైదరాబాద్:
చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు (జయచంద్రారెడ్డి), తణుకు ఎమ్మెల్యే కారుమూరు వెంకట నాగేశ్వరరావు బుధవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. వీరిద్దరూ బుధవారంనాడు విడివిడిగా శ్రీ జగన్మోహన్రెడ్డిని లోటస్పాండ్లోని ఆయన నివాసంలో కలుసుకుని పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వీరిద్దరూ ఆ పార్టీకి గుడ్బై చెప్పేశారు. ప్రముఖ సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నెల్లూరు జిల్లా సీనియర్ నేత వంటేరు వేణుగోపాల్రెడ్డి, చింతలపూడి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు సన్నిహిత సహచరుడు గంటా మురళి కూడా శ్రీ వైయస్ జగన్ను కలిసి పార్టీలో చేరారు.
సీకే బాబుకు శ్రీ జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాబుతో పాటుగా వచ్చిన ఆయన సతీమణి లావణ్యకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు. నాగేశ్వరరావు పెద్ద సంఖ్యలో తన అనుచరులతో వచ్చి పార్టీలో చేరిన సందర్భంగా నర్సాపురం, ఏలూరు లోక్సభ పార్టీ సమన్వయకర్తలు ఎం.ప్రసాదరాజు, తోట చంద్రశేఖర్ కూడా ఉన్నారు. వేణుగోపాల్రెడ్డి చేరిక సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి గౌతంరెడ్డి కూడా ఉన్నారు.
వైయస్ఆర్ పథకాలు ఆదర్శనీయం: కారుమూరు
పదేళ్ల కిందట భయానకమైన కరువు కాటకాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజానీకానికి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలు ఎంతో మేలు చేశాయని, ఇవన్నీ శ్రీ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే అమలవుతాయనే విశ్వాసంతోనే పార్టీలో చేరానని కారుమూరు నాగేశ్వరరావు చెప్పారు. వైయస్ఆర్ పథకాల వల్ల బడుగు, బలహీనవర్గాలకు ఎక్కువగా మేలు జరిగిందన్నారు. తన లేఖతోనే రాష్ట్రం విడిపోయిందని తెలంగాణలో మాట్లాడుతూ... సీమాంధ్రలో మరో విధంగా చెబుతున్న చంద్రబాబు నాయుడు నిలకడలేని నాయకుడని విమర్శించారు. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి శ్రీ వైయస్ జగన్తోనే సాధ్యమన్నారు.
సీఎం అంటే వైయస్సే: కోదండరామిరెడ్డి
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి నిత్యం నవ్వుతూ ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అలా ఉండేవారని సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి కొనియాడారు. ముఖ్యమంత్రిననే భావం లేకుండా అందరినీ పలకరిస్తూ పేద, బడుగు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని చెప్పారు. వైయస్ఆర్ అంటే తనకు అపారమైన గౌరవం అభినం ఉన్నాయని, ఆయన కడుపున పుట్టిన బిడ్డగా శ్రీ జగన్ ఆంధ్రప్రదేశ్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలరని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే తాను పార్టీలో చేరానని కోదండరామిరెడ్డి వెల్లడించారు.
బాబును, బీజేపీని జనం నమ్మరు: వంటేరు
రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబును, దగ్గరుండి విభజన జరిపించిన బీజేపీని రాష్ట్ర ప్రజలు నమ్మరని వంటేరు వేణుగోపాలరెడ్డి చెప్పారు. కొత్త రాష్ట్రం శ్రీ వైయస్ జగన్ నేతృత్వంలో అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు.