బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
రేపు మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు
03 Sep 2018 6:54 PM
అమరావతి: గుంటూరులో ఇటీవల నిర్వహించిన ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన అమాయక ముస్లిం యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వివిధ పోలీసు స్టేషన్లకు తిప్పిన ఘటనపై ఈ నెల 4వ తేదీ వైయస్ఆర్సీపీ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనుంది. ఈ మేరకు పార్టీ మైనారిటీ నాయకులు మహ్మద్ ఇక్బాల్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం సభలో ప్లకార్డ్సు ప్రదర్శించిన యువకులను పోలీసులు దాదాపు 30 గంటలపాటు నిర్బంధించి, తీవ్ర వేధింపులకు గురిచేసి, చివరకు టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారన్నారు. ఫిర్యాదులో గానీ, ఎఫ్ఐఆర్లో గానీ పొందుపరచని అంశాలను రిమాండ్ రిపోర్ట్లో చేర్చడం చూస్తే ముస్లిం యువకులపై ప్రభుత్వం ఏ స్థాయిలో కక్షసాధింపు చర్యలకు దిగుతోందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. వారంతా దేశద్రోహానికి పాల్పడ్డారని చిత్రీకరించే కుట్రకు టీడీపీ ప్రభుత్వం తెర తీసిందని, ఈ విషయాన్ని మానవ హక్కుల సంఘానికి వివరిస్తామని ఇక్బాల్ తెలిపారు.