వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అందరి హృదయాల్లో స్థానం సంపాదిస్తా
28 Apr 2014 3:27 PM
వరంగల్/ఖమ్మం/హైదరాబాద్:
ప్రతి ఒక్కరి గుండెలో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడూ చేయని విధంగా తాను ఓదార్పు యాత్ర చేసి ప్రజల సమస్యలను దగ్గరగా చూశానని, ఆ సమస్యలను పరిష్కరించడమే తన ధ్యేయమన్నారు. పేదవాళ్ళ గుండె చప్పుడు వినే తాము పార్టీ మేనిఫెస్టో రూపొందించానని ఆయన చెప్పారు. ‘వైయస్ఆర్ జనభేరి’ పేరున సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న శ్రీ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సభ, పలు చోట్ల రోడ్ షో, వరంగల్ జిల్లా మహబూబాబాద్లో బహిరంగ సభ నిర్వహించారు. ఆ తరువాత సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అడ్డగుట్ట, శేరిలింగంపల్లి బహిరంగ సభల్లో ప్రసంగించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమాన జనసందోహాన్ని ఉద్దేశించి శ్రీ జగన్ ప్రసంగించారు.
'సీమాంధ్రకు సీఎంగా ప్రమాణస్వీకారం చేసినా, తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని మరిచిపోను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుచేసే ప్రతి పథకాన్నీ తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేయించడానికి కృషిచేస్తాం. తెలంగాణలో ఆగిపోయిన ఓదార్పుయాత్రను నా చెల్లి షర్మిలమ్మ పూర్తిచేస్తారు. నాన్న వైయస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన పెద్ద కుటుంబంలో భాగమైన తెలంగాణ ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించం’ అని శ్రీ జగన్ పునరుద్ఘాటించారు.
పేదల గుండె చప్పుడే.. వైయస్ఆర్సీపీ మేనిఫెస్టో :
‘కొన్ని పార్టీలు ఏసీ రూముల్లో కూర్చుని మేనిఫెస్టో రాసుకుంటే, నేను మాత్రం పేద ప్రజల గుండె చప్పుడుతో రాశాను. ఓదార్పుయాత్రలో భాగంగా ఇప్పటి వరకు 800 పూరిగుడిసెలకు వెళ్లి పేదల కష్టాలు తెలుసుకున్నాను. వారు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూశాను. నేను చూసింది, విన్నది, తెలుసుకున్నది, అర్థం చేసుకున్నదే మేనిఫెస్టోలో పెట్టాను. ఢిల్లీ నుంచి సోనియా గాంధీ పంపిన సీల్డు కవర్ సీఎంలకు పేదల కష్టాలు ఎలా తెలుస్తాయి? సీల్డు కవర్ సీఎం కావాలో.. ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి సీఎం కావాలో ప్రజలే తేల్చుకోవాలి' అని శ్రీ వైయస్ జగన్ అన్నారు.
విశ్వసనీయత- కుట్రలు, కుతంత్రాల మధ్య పోటీ :
'ప్రస్తుత ఎన్నికల్లో నిజాయితీ, విశ్వసనీయత ఒకవైపు, కుట్రలు, కుతంత్రాలు మరొకవైపు పోటీపడుతున్నాయి. విశ్వసనీయతతో కూడిన వ్యక్తులకు ఓటేస్తారో.. లేక వెన్నుపోటుదారులను ఎన్నుకుంటారో ప్రజలే తేల్చుకోవాలి. దివంగత మహానేత వైయస్ఆర్ మండుటెండలను సైతం లెక్కచేయకుండా 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి పేదవాడి గుండెచప్పుడు విన్నారు. వారు పడుతున్న కష్టాలను స్వయంగా చూశారు. పేదలకు ఏం కావాలో సీఎంగా ఆయన అదే చేశారు' అని గుర్తుచేశారు.
'ఒకప్పుడు పేదవాడికి క్యాన్సరో.. గుండె నొప్పో వస్తే వైద్యం కోసం రెండు, మూడు లక్షలు అప్పు చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండేది. అదే వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో ఆగ్యోశ్రీ పథకంతో పాటు 108 సర్వీసులను అందుబాటులోకి తెచ్చార'ని శ్రీ జగన్ తెలిపారు. కుటుంబంలో కనీసం ఒక్కరైనా ఇంజినీరో, డాక్టరో అయితే పేదరికం పోతుందనే ఆలోచనతో ఫీజు రీయింబర్సుమెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ తీసుకురాని సంక్షేమ పథకాలు వైయస్ఆర్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. ఒకప్పుడు కేవలం 24 వేల మందికి మాత్రమే తెల్ల రేషన్ కార్డులు ఉండగా, వైయస్ఆర్ అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇప్పించారన్నారు. 72 వేల మందికి కార్డులు ఇప్పించిన ఘనత మహానేత డాక్టర్ వైయస్ఆర్దే అన్నారు.
చంద్రబాబు పాలన భయానకం :
ఇప్పుడు ఆల్ ఫ్రీ అంటున్న చంద్రబాబు తన తొమ్మిదేళ్లలో పాలనలో పేదల గురించి ఎందుకు ఆలోచించలేదని శ్రీ జగన్ నిలదీశారు. ఏ రోజూ పేదల జీవితాలు పట్టని చంద్రబాబు రాజకీయాలను దిగజార్చి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రోజుకోమాట, పూటకో అబద్ధం చెప్పి పట్టపగలే ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వైయస్ కన్నా ముందు చంద్రబాబు హయాం ఒక భయానక పాలన అన్నారు. ఏ రోజూ ఆయన పేదల పరిస్థితి గురించి ఆలోచించలేదన్నారు. కాలేజీల్లో చదువుకునే పేద విద్యార్థులు వేల రూపాయల ఫీజులు ఎలా కడుతున్నారని, ప్రతి సంవత్సరం ఏవో ఆస్తులు అమ్మితే తప్పించి చదువుకోలేకపోతున్నారని ఆలోచించలేద'న్నారు.
'కనీసం ఒక్క రోజయినా చంద్రబాబు నాయుడు కాలేజీలకు వెళ్లి విద్యార్థులను విచారించలేదు. ఆ రోజుల్లో గ్రామానికి వెళితే ఎవరైనా పేదవాడికి గుండెపోటు వస్తేనో, ప్రమాదం జరిగితేనో ఆస్పత్రికి వెళ్లాలంటే భయపడేవారు. ఆసుపత్రిలో చేర్పిస్తే రెండు లక్షలో, మూడు లక్షలో కట్టాలని డాక్టర్లు చెప్పినప్పుడు ఆ డబ్బుల కోసం 2 నుంచి 5 రూపాయల వడ్డీకైనా తెచ్చుకునేందుకు పరుగెత్తిన రోజులు నాకు గుర్తుకొస్తున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వేసే ఓట్లు చాలా కీలకమైనవి. మీ తలరాతను మార్చే ఎన్నికలివి.. మీరు వేసే ప్రతి ఓటు ఎలాంటి పార్టీకి వేస్తున్నారు? ఎటువంటి నాయకత్వానికి వేస్తున్నారనేది ప్రతి ఒక్కరూ ఓటేసే ముందు ప్రశ్నించుకోవాలి. వైయస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు వేసి.. మళ్లీ వైయస్ఆర్ సువర్ణయుగాన్ని తిరిగి తెచ్చుకుందాం’ అని శ్రీ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు.
ఇచ్చిన మాట కోసమే ఇన్ని కష్టాలు, నష్టాలు :
‘నాన్న చనిపోయిన 20 రోజుల తర్వాత ఆ స్థలానికి వెళ్లా. అక్కడ పడి ఉన్న హెలికాప్టర్ ముక్కలు ఇప్పటికీ నా కళ్ల ముందు కనిపిస్తున్నాయి. నాన్న కోసం చనిపోయిన వారి కోసం ఆలోచించా. మహానేత మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలకు అండగా నిలుస్తానని, ఆ కుటుంబ సభ్యులను ఓదారుస్తానని అక్కడే మాటిచ్చా. ఈ మాట కోసమే ఇప్పుడు ఇన్ని కష్టాలు, నష్టాలు' ఎదుర్కొంటున్నా అన్నారు.
కేంద్ర మంత్రి, సీఎం పదవులిస్తానని సోనియా అన్నారు :
'నేను, అమ్మ కలిసి సోనియాగాంధీ దగ్గరికి వెళ్లాం. ఓదార్పు యాత్ర వద్దన్నారు. అవసరమైతే జిల్లా కేంద్రాల్లో కార్యక్రమం పెట్టి ఒకే చోట చేయమన్నారు. సోనియాగాంధీ కేంద్ర మంత్రి పదవి, తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నారు. అప్పుడు రెండు దారులు ఉన్నాయి. ఒకటి సోనియాగాంధీ చెప్పినట్లు చేయడం, రెండోది ఇచ్చిన మాట. అప్పుడు నా గుండెలో అనిపించినట్లు రెండో మార్గంలోనే పయనించా' అని శ్రీ జగన్ చెప్పారు.
అతి దగ్గరగా ప్రజల బాధలు చూశా :
'మహానేత కోసం మరణించిన వారిని పలకరించేందుకు బయలుదేరాను. నెలలో 25 రోజులు ఇంటి బయటే గడిపాను. ఏ నాయకుడూ వెళ్లని ఇళ్లకు వెళ్లాను. ప్రజల ఇబ్బందులను దగ్గరగా చూశాను. తిండికి లేని వారు ఉన్నారు. ఒక్కపూట మాత్రమే తినేవారు ఉన్నారు. వృద్ధాప్యంలో పూట గడిచేందుకు కూలీకి వెళ్లేవారిని గమనించా. గర్వంగా చెబుతున్నా.. ప్రజల బాధలు దగ్గరగా చూశా. పేదలు ఎంత అన్యాయమైన స్థితిలో ఉన్నారో గమనించా. పుట్టిన ఎవరైనా చనిపోక తప్పదు. ఇది జరిగే ముందు ప్రతి పేదవాడి గుండెల్లో నా ఫొటో ఉండాలి' అన్నారు.
ఇంకా 400 కుటుంబాలను ఓదార్చలేకపోయా :
'గిట్టని వారి కుట్రలతో జైలుకు వెళ్లడం, తెలంగాణ వంటి రకరకాల కారణాలతో ఓదార్పు పూర్తి చేయలేకపోయా. తెలంగాణలో ఖమ్మంలో మాత్రమే పూర్తిచేశా. ఇంకా 400 కుటుంబాల వద్దకు వెళ్లలేకపోయా. వైయస్ఆర్సీపీ అభ్యర్థులను పంపించా. నా సోదరి షర్మిల ఓదార్పును పూర్తిచేస్తారు. మహానేత వైయస్ఆర్ మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి ప్రతి కుటుంబం దగ్గరికి నా సోదరి వస్తుంది. ఎన్నికల తర్వాత ఇది జరుగుతుంది. వైయస్ఆర్ చనిపోతూ నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. మీకు అండగా ఉంటాం’ అని శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.