30 టీడీపీ కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక

పత్తికొండ: క‌ర్నూలు జిల్లాలో అధికార తెలుగు దేశం పార్టీకి షాక్ త‌గిలింది. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి వ‌ర్గానికి చెందిన 30 టీడీపీ కుటుంబాలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ప‌త్తికొండ మండల పరిధిలోని పెద్దహుల్తి గ్రామంలో టీడీపీకి చెందిన 30 కుటుంబాలు పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త చెరుకులపాడు శ్రీదేవి సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. వారందరికీ ఆమె కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు ఆమెకు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. శ్హుల్తి లింగేశ్వరస్వామి దేవాలయంలో పూజల అనంతరం గ్రామ నాలుగురోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన సభలో వండ్రప్ప, రామాంజిని, రవి, రంగయ్య, లక్ష్మినారాయణ, రామకృష్ణ, రాజబాబు, రమేశ్‌తో పాటు 30 కుటుంబాలకు చెందిన వాల్మీకులు, ఎస్సీలు శ్రీదేవి సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి సి.శ్రీరంగడు, మండల కన్వీనర్‌ జూటూరు బజారప్ప, అడ్వకేట్‌ కారం నాగరాజు, స్థానిక నాయకులు నక్కల కారుమంచి, చెన్నంపల్లి జయకృష్ణ, టైలర్‌ నాగరాజు, చాకలి తిమ్మప్ప పాల్గొన్నారు.
మ‌హిళా స‌ద‌స్సుపై టీడీపీ కుట్ర‌లు
వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన మ‌హిళా స‌ద‌స్సుపై టీడీపీ కుట్ర‌లు చేస్తుంద‌ని ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొన్న శ్రీ‌దేవి అన్నారు. ఆమె మాట్లాడుతూ..చంద్ర‌బాబు ఎన్ని కుట్ర‌లు చేసినా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి వ‌స్తున్న ఆద‌ర‌ణ‌ను ఆప‌లేర‌న్నారు. ప్ర‌తి ప్రాంతంలో టీడీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌న్నారు. ఎవ‌రెన్ని కుట్ర‌లు చేసిన మహిళ‌లు గోడ‌లు ప‌గుల‌గొట్టి మ‌రి మ‌హిళా స‌ద‌స్సులో పాల్గొంటున్నార‌ని శ్రీ‌దేవి తెలిపారు.

  


Back to Top