బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
టైమ్సు నౌ సర్వేకు విశ్వసనీయత లేదు: కొణతాల
18 Apr 2013 11:10 AM
హైదరాబాద్: టైమ్సు నౌ సంస్థ వెలువరించే సర్వే ఫలితాలకు విశ్వసనీయత ఉండదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘2009 సాధారణ ఎన్నికల సందర్భంగా ఇదే టైమ్సు నౌ సంస్థ చేసిన సర్వే అవాస్తవమని రుజువైందన్నారు. అప్పట్లో మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్కు 15 ఎం.పి. సీట్లు వస్తాయని ఆ సంస్థ చెప్పిందన్నారు. కానీ 33 స్థానాల్లో విజయదుందుభి మోగించిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు.
ఇప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్కు 12 స్థానాలు వస్తాయని చెబుతోందన్నారు. అంటే వారి లెక్క ప్రకారం 27 సీట్లు వస్తాయన్న మాట’ అని కొణతాల పేర్కొన్నారు. చంద్రబాబు పాదయాత్ర వల్ల ఆయన గ్రాఫ్ పెరిగిందని, అందుకే 6 ఎం.పి. స్థానాల నుంచి 9కి పెరిగిందంటున్నారని, అలాగైతే పాదయాత్ర ఆపితే సున్నాకు పడిపోతారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు 3 స్థానాలు పెరిగాయంటున్న టిడిపి నాయకులు.. 20 సీట్లు గెలవడానికి ఆయనతో 20వేల కిలోమీటర్లు నడిపిస్తారా? అని కొణతాల ఎద్దేవా చేశారు.