వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సమైక్యానికి మద్దతివ్వండి: జయకు జగన్ వినతి
05 Dec 2013 11:56 AM
చెన్నై :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తున్న కేంద్రం చర్యలను అడ్డుకోవాలని తమిళనాడు సీఎం జయలలితకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకరించాలని ఆయన కోరారు. శ్రీ జగన్మోహన్రెడ్డి బుధవారంనాడు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిశారు. విభజనకు వ్యతిరేకంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా శ్రీ జగన్ జయలలితతో భేటీ అయ్యారు.
ప్రజావ్యతిరేక చర్యకు కాంగ్రెస్ పార్టీ పాల్పడుతోందని ఈ సందర్భంగా శ్రీ జగన్ ఆరోపించారు. అంతకు ముందు చెన్నై విమానాశ్రయంలో దిగిన శ్రీ జగన్కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ జగన్ వాహన శ్రేణి ప్రయాణించే రహదారి అంతా పూలవర్షం కురిపించారు. టపాకాయలు కాల్చి వైయస్ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.