వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

 
 
తూర్పు గోదావ‌రి: లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ చటర్జీ(89) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం కోల్‌కతాలోని ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, ప్రతిపక్ష నాయకులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. పార్లమెంట్‌లో విలువలకు కట్టుబట్టారని, ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఆయన మరణంతో నీతి, విలువల కలిగిన గొప్ప నాయకుడిని దేశం కోల్పోయిందని సంతాప సందేశంలో వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు. 

1929, జూలై 25న అసోంలోని తేజ్‌పూర్‌లో సోమ్‌నాథ్‌ చటర్జీ జన్మించారు. మిత్రా ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ప్రెసిడెన్సీ కాలేజీ, కలకత్తా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1968లో సీపీఎంలో చేరిన చటర్జీ పదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు.  
Back to Top