జగన్‌ను సీఎం చేద్దాం.. సువర్ణయుగం తెద్దాం

గుంటూరు:

‘గడచిన నాలుగున్నరేళ్ళలో మనం ఎన్నో అవస్థలు పడ్డాం. మంచి నాయకుడిని ఎన్నుకునే తరుణం మరో మూడు వారాల్లో రానుంది. మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డిలో ఉండే దీక్ష, పట్టుదల, తెగువ, మొండితనం అన్నీ జగ‌న్‌బాబులో ఉన్నాయి. అది మీరు ప్రత్యక్షంగా చూశారు. జగన్‌బాబును ముఖ్యమంత్రిని చేసుకుందాం, మహానేత అందించిన సువర్ణయుగాన్ని మళ్లీ మనమే తెచ్చుకుందాం’ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పిలుపునిచ్చారు. ‘వై‌యస్ఆర్ జనభేరి’ పేరుతో ఇటీవల తొలిదశ ఎన్నికల ప్రచారం చేసిన విజయమ్మ.. రెండవ దశ ప్రచారాన్ని శనివారం ప్రారంభించారు. ఉదయం హైదరాబా‌ద్ నుంచి విజయవాడ మీదుగా గుంటూరు జిల్లా నందివెలుగు సెంట‌ర్‌కు ఆమె చేరుకున్నారు. శ్రీమతి విజయమ్మకు వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

నందివెలుగు నుంచి కొలకలూరు మీదుగా గుడివాడ, కోపల్లె, అంగలకుదురు, దుండిపాలెం, యడ్లపల్లి, వలివేరు, చుండూరు, మోతుకూరు, మోపర్రు, తురిమెళ్ల, అమృతలూరులో విజయమ్మ నిర్వహించిన రోడ్‌షోకు ఆయా గ్రామాల్లో మహానేత వైయస్ఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఇంటూరు, గోవాడ మీదుగా బాపట్ల నియోజకవర్గం చందోలుకు చేరుకుని వై‌యస్ఆర్ జనభేరి సభలో‌ శ్రీమతి విజయమ్మ పాల్గొన్నారు.

శ్రీమతి విజయమ్మ వెంట రోడ్‌షోలో గుంటూరు పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, పార్టీ నాయకులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్తలు అన్నా బత్తుని శివకుమార్, కిలారి వెంకట రోశయ్య, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున, బాపట్ల సమన్వయ కర్త కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top