కిర్లంపూడిలో నేడు షర్మిల బహిరంగ సభ

పెద్దాపురం (తూ.గో.జిల్లా),

18 జూన్‌ 2013: మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 183వ రోజు మంగళవారం వివరాలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం,‌ తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ప్రకటించారు.‌ వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా పులిమేరు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.

అక్కడి నుంచి చదలవాడ, తిరపతి మీదుగా 6.5 కిలోమీటర్టు నడచి దివిలి చేరుకుంటారు. దివిలిలో ఆమె మధ్యాహ్న భోజనానికి ఆగుతారు. భోజన విరామం అనంతరం పాదయాత్ర ప్రారంభించి రాజుపాలెం, కిర్లంపూడి వరకూ 7.1 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగిస్తారు. కిర్లంపూడిలో నిర్వహించే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తారు. కిర్లంపూడి సమీపంలో మంగళవారం రాత్రికి ఆమె బస చేస్తారు. శ్రీమతి షర్మిల మంగళవారంనాడు మొత్తం 13.6 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని రఘురాం, చిట్టబ్బాయి వివరించారు.

Back to Top