కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రారంభమైన షర్మిల 210వ రోజు పాదయాత్ర
15 Jul 2013 11:13 AM
ఆకులపేట (విజయనగరం జిల్లా),
15 జూలై 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 210వ రోజుకు చేరింది. శ్రీమతి షర్మిల సోమవారం ఉదయం విజయనగరం జిల్లాలోని ఆకులపేట నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఆమె బాగువలస మీదుగా వెదుళ్లవలస చేరుకుంటారు. వెదుళ్ళవలసలో ఆమె మధ్యాహ్న భోజన విరామానికి ఆగుతారని పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ పెన్మెత్స సాంబశివరాజు తెలిపారు.
భోజన విరామం అనంతరం శ్రీమతి షర్మిల వెంకటాపురం జంక్షన్, బిళ్ళలవలస, కుంచుగుమ్మాడ, గర్బాం గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. గర్భాంలో రాత్రికి బసచేస్తారు. కాగా, విజయనగరం జిల్లాలో శ్రీమతి షర్మిల 8వ రోజు పాదయాత్ర చేస్తున్నారు. సోమవారంనాడు ఆమె మొత్తం 16.3 కిలోమీటర్లు నడుస్తారని రఘురాం, సాంబశివరాజు వివరించారు.