శ్రీమతి షర్మిల నేటి మరో ప్రజాప్రస్థానం షెడ్యూల్

శరభవరం (తూ.గో.జిల్లా),

20 జూన్‌ 2013: వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల గురువారం 185వ రోజు పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ‌తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ప్రకటించారు.‌ గురువారం ఉదయం శ్రీమతి షర్మిల జిల్లాలోని శరభవరం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఆమె చింతలూరు చేరుకుంటారు. చింతలూరులోని శాంతి ఆశ్రమం సమీపంలో ఆమె మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం శ్రీమతి షర్మిల పాదయాత్ర శాంతిఆశ్రమం, వెంకట్‌నర్వ, యు. జగన్నాథపురం మీదుగా కె. కొత్తూరు వరకూ నడుస్తారు. గురువారం రాత్రికి శ్రీమతి షర్మిల కె.కొత్తూరు నుంచి మరి కొంత దూరం ప్రయాణించి బస చేస్తారని రఘురాం, చిట్టబ్బాయి తెలిపారు. శ్రీమతి షర్మిల గురువారం నాడు మెత్తం 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.

Back to Top