ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం

తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడ సంతోషంగా లేరని వైయస్సార్సీపీ నేత శివకుమార్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలమీద కేసీఆర్ నీళ్లు చల్లారని మండిపడ్డారు. వైయస్ఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళుతూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. సెక్రటేరియట్ తరలింపును వైయస్సార్సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్నో ఏళ్లుగా పాలిస్తున్న ప్రాంతాన్ని టీఆర్ఎస్ సర్కార్ కూల్చేయడం దారుణమన్నారు.

Back to Top