షర్మిల నేటి పాదయాత్ర ఇలా..

లత్తవరం(అనంతపురం)

: మహానేత వైయస్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం లత్తవరం శివారు నుంచి ప్రారంభమవుతుంది. ఉరవకొండ పట్టణంలో పర్యటించిన అనంతరం షర్మిల అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. మార్కెట్ యార్డు వద్ద రాత్రి బస చేస్తారు. ఆమె 10 కిలోమీటర్లు నడుస్తారని కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. పాదయాత్ర ఆదివారం ఉరవకొండలోని మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమై గాలిమరల సర్కిల్ మీదుగా వజ్రకరూరు మండలంలోని పీసీ ప్యాపిలి క్రాస్, కడమలకుంట క్రాస్, హంద్రీనీవా కాలువ, రాగులపాడు వరకు సాగుతుందని వారు వివరించారు. రాగులపాడులో బహిరంగ సభలో పాల్గొని, రాత్రి అక్కడే బస చేస్తారు.

తాజా వీడియోలు

Back to Top