మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
షర్మిల మరో ప్రజాప్రస్థానం నేటి షెడ్యూల్ ఇలా..
12 Feb 2013 9:58 AM
నల్గొండ, 12 ఫిబ్రవరి 2013: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారంనాడు నల్గొండ జిల్లా కనగల్ మండలంలో సాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయాలను, పరోక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొమ్ము కాస్తున్న చంద్రబాబు తీరును నిరసిస్తూ శ్రీ వైయస్ తరఫున శ్రీమతి షర్మిల ఈ సుదీర్ఘ, చారిత్రక పాదయాత్ర చేస్తున్నారు.
మంగళవారం ఉదయం జిల్లాలోని ఉడతలపల్లి నుంచి శ్రీమతి షర్మిల 64వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది. నల్గొండ నియోజకవర్గంలోని కనగల్ మండలం పరిధిలో ఉన్న కురంపల్లి, జి.యడవెల్లి, బుడమర్లపల్లి, కనగల్ ఎక్సురోడ్డు మీదుగా కనగల్ మండల కేంద్రానికి శ్రీమతి షర్మిల పాదయాత్ర చేరుకుంటుంది. కనగల్ సెంటర్లో నిర్వహించే బహిరంగ సభలో శ్రీమతి షర్మిల అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కనగల్ సమీపంలోనే మంగళవారం రాత్రికి శ్రీమతి షర్మిల బస చేస్తారు.