బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
సీబీఐ చార్జిషీటులో అంశాలు కొట్టివేత
14 May 2013 6:29 PM
హైదరాబాద్, 14 మే 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఊరట కలిగించే అంశం మంగళవారం నాడుచోటుచేసుకుంది. ఆయనకు వ్యతిరేకంగా సీబీఐ ఐపీసీ 409, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12 ప్రకారం దాఖలు చేసిన నమ్మకద్రోహం, అవినీతి అంశాలను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టేసింది.
దాల్మియా సిమెంట్సు కేసులో సీబీఐ దాఖలు చేసిన ఐదో చార్జిషీటును పరిశీలిస్తున్న సందర్భంలో కోర్టు పై ఆరోపణలను అంగీకరించలేదు. వాటిని నిరూపించడానికి తగిన సాక్షాధారాలు లేవని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. శ్రీ జగన్మోహన్ రెడ్డి నమ్మకద్రోహానికీ, అవినీతికి పాల్పడ్డాడనికి ఇందులో ఆధారాలు లేవని అభిప్రాయపడింది.
సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటులో పేర్కొన్న రెండు సెక్షన్లు శ్రీ జగన్మోహన్ రెడ్డికి వర్తించవని కోర్టు స్పష్టంచేసింది.
సీబీఐ గతంలో దాఖలుచేసిన నాలుగు చార్జీషీట్లలో కూడా ఇవే ఆరోపణలను ప్రస్తావించిన సంగతిని కోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో గతంలో దాఖలు చేసిన చార్జీషీట్లలో చేసిన ఈ ఆరోపణలు హైకోర్టులో న్యాయ పరిశీలనకు నిలుస్తాయా అనేది వేచి చూడాలి.