22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు
సహకార ఎన్నికల్లో సత్తా చాటాలి
16 Jan 2013 9:20 AM
ప్రకాశం జిల్లా:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఆదరణ పెరిగిందని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిని నిర్దోషిగా భావిస్తున్న ప్రజలు ఆయన రాకకోసం ఎదురు చూస్తున్నారన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. తన స్వగ్రామమైన మేదరమెట్లలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. సెంటర్లోని మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండలంలోని అనమనమూరులో గ్రామదేవత అంకమ్మతల్లికి పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులతో పార్టీ పటిష్టత, సహకార ఎన్నికలపై వైవీ సుబ్బారెడ్డి చర్చించారు. సహకార ఎన్నికల్లో పార్టీ నిలిపిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.