బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
అంతులేని టీడీపీ భూ దోపిడీ
22 Jul 2016 12:49 PM
విజయవాడ : రాజధాని ప్రాంతంలో టీడీపీ భూ దాహానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా రైతుల భూములను దోచుకొని బాబు బ్యాచ్ విదేశీ కంపెనీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. భూములివ్వం మొర్రో అని రైతులు నెత్తి నోరు మొత్తుకుంటున్నా వినకుండా భయపెట్టి, బెదిరించి భూములను దోపిడీ చేస్తోంది.
తాజాగా మరోసారి, రాజధాని ప్రాంత రైతుల నుంచి భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ల్యాండ్ పూలింగ్ కు భూములివ్వని రైతుల నుంచి భూసేకరణ ద్వారా భూములు లాక్కొనేందుకు సిద్ధమైంది. నేలపాడు గ్రామానికి చెందిన 27 ఎకరాల భూసేకరణకు గుంటూరు జిల్లా కలెకర్ట్ భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ తీరుపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. తమ భూముల జోలికొస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు.