బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
పత్రికలు, ఛానళ్లపై కక్షసాధింపు తగదు
13 Jun 2016 1:13 PM
విజయనగరం: రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నియంత పాలన కొనసాగిస్తున్నారని వైయస్సార్సీపీ జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తున్నందువల్లే టీడీపీ నాయకులు ఎంఎస్ఓలపై ఒత్తిడి తీసుకువచ్చి సాక్షి ఛానళ్ల ప్రసారాలు నిలిపివేశారన్నారు. ఛానల్ ప్రసారాలు నిలిపివేసినంత మాత్రాన ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు ప్రజలకు తెలియవనుకోవడం అవివేకమన్నారు.
భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు పనితీరుపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారన్నారు. పత్రికలు, టీవీ ఛానళ్లపై వ్యక్తిగత, రాజకీయ కక్ష సాధింపులు చేపట్టడం తగదన్నారు. బాబు, ఆయన అనుచరులకు వంతపాడే ఛానళ్లు, పత్రికలకు లబ్ధి చేకూర్చడం కోసమే సాక్షిపై దాడులు చేయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిలిపివేసిన సాక్షి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.