పెల్లుబికుతున్న నిరసనలు

ప్రతిపక్ష నాయకుడు, వైెఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తారని, కనీసం ప్రస్తావిస్తారని అంతా ఆశిస్తారు. దాన్ని బట్టి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక ప్రకటన చేస్తారని అనుకొన్నారు. చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకపోవటంతో ప్రధాని కూడా దాని గురించి ఏమాత్రం మాట్లాడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్త వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. దీనికి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. 
Back to Top