టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన
రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం
02 Dec 2012 2:55 PM
హైదరాబాద్ 2 డిసెంబర్ 2012 : ఎస్.సి,ఎస్.టి.సబ్ప్లాన్ చట్టబద్ధత ప్రక్రియ అంతా ప్రణాళికాసంఘ మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా జరుగుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ (సీజీసీ) సభ్యుడు, ఎం.ఎల్.సి జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్.సి, ఎస్.టి.ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించే విధానం లోపభూయిష్ఠంగా ఉందని అభ్యంతరం తెలిపారు. ఇది సారమంతా తీసేసిన ప్రాణం లేని బిల్లు మాత్రమేనన్నారు.