వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రైతు సమస్యలపై వైయస్ఆర్సిపి ఆందోళన
27 Feb 2013 6:33 PM
ఆదిలాబాద్, 27 ఫిబ్రవరి 2013: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారంనాడు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళనలో పార్టీ నాయకులు బి. జనక్ప్రసాద్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, బోడ జనార్ధన్ పాల్గొన్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళన నిర్వహించిన అనంతరం వారు నిర్మల్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.
పంట నష్టపోయిన రైతులకు 15 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించాలని, లేకపోతే 48 గంటల దీక్ష చేపడతామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ వినతిపత్రంలో హెచ్చరించారు. రైల్వే మంత్రి పి.కె. బన్సల్ మంగళవారంనాడు లోక్సభలో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని వైయస్ఆర్సిపి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన జిల్లా అయినందునే ఆదిలాబాద్పై కేంద్రం చిన్నచూపు చూస్తోందని వారు ఆరోపించారు.