రైల్వే మంత్రి ముకుల్‌రాయ్‌తో ఎంపీ మేకపాటి భేటి

న్యూఢిల్లీ, 6 సెప్టెంబర్‌ 2012: వైయస్ఆ‌ర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, నెల్లూరు లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి గురువారంనాడు కేంద్ర రైల్వే మంత్రి ముకుల్‌రాయ్‌తో భేటి అయ్యారు. తమ నియోజకవర్గంలోని సమస్యలను ఈ సందర్భంగా రైల్వే మంత్రి దృష్టికి ఆయన తీసుకువచ్చారు.

నడికుడి- శ్రీకాళహస్తి రైల్వేపనులను వేగవంతం చేయాలని ముకుల్‌రాయ్‌కు మేకపాటి విజ్ఞప్తి చేశారు. కావలిలో హౌరా-యశ్వంత్‌పూర్, శబరి, శేషాద్రి ఎ‌క్స్‌ప్రెస్‌లను ఆపాలని, బిట్రకుంటలో పినాకిని, నెల్లూరులో కోరమాండల్, తమిళనాడు, గరీ‌బ్‌రథ్ ఎ‌క్స్‌ప్రెస్‌లను ఆపాలని రైల్వే మంత్రిని ఎంపీ మేకపాటి కోరారు.

Back to Top