బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
చంద్రబాబుది ప్రచార ఆర్భాటం
21 Jun 2016 7:32 PM
–
వైయస్ఆర్సీపీ
నేత బెల్లాన చంద్రశేఖర్
విజయనగరం(చీపురుపల్లి): రాష్ట్రంలో ప్రజల దృష్టిని మరల్చడంతో పాటు ప్రచార
ఆర్భాటం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని
వైయస్ఆర్సీపీ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్
మండిపడ్డారు. మండలంలోని రామలింగాపురంలో వరి విత్తనాలు పంపిణీ కార్యక్రమాన్ని
మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ
కోసం ప్రతీ ఒక్కరూ చర్చించుకుంటున్న నేపధ్యంలో ఆ దృష్టిని మరల్చేందుకు ఏరువాక అంటూ
హడావుడి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే రైతులు దుక్కులు దన్నుకుని విత్తనాలు
వేసుకున్నాక ఏరువాక అంటూ రైతులను చంద్రబాబునాయుడు మభ్య పెట్టడం విడ్డూరంగా
ఉందన్నారు. చంద్రబాబునాయుడుకు నిజంగా రైతులుపై ప్రేమ ఉంటే ఆయన ఇచ్చిన మాట
ప్రకారం రైతులు రుణాలు మాఫీ చేయాలి తప్ప ఇలా ఏరువాక కార్యక్రమాలు పేరుతో ప్రజాధనం
లూటీ చేయకూడదని హితవు పలికారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు రేవల్ల
సత్తిబాబు,
మండల పార్టీ
నాయకులు ఇప్పిలి అనంతం,
కరిమజ్జి
శ్రీనివాసరావు,
రామలింగాపురం, అలజంగి సర్పంచ్లు కంది పాపినాయుడు
పాల్గొన్నారు.