<strong>కృష్ణా:</strong> వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర ఆదివారం ఉదయం 1900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. 148 వ రోజు పామర్రు నియోజకవర్గంలో ప్రవేశించిన పాదయాత్ర తాడంకి వద్ద ఈ మైలురాయిని దాటింది . ఈ సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ గ్రామంలో మొక్కను నాటి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంతకు ముందు గ్రామస్తులు వైయస్ జగన్ కు భారీ స్వాగతం పలికారు. ఊరు ఊరంతా సందడి నెలకొంది. జై జగన్ నినాదాలు పెక్కుటిల్లాయి. <br/>గత నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర ఏడు జిల్లాల్లో పూర్తి అయి ప్రస్తుతం 8 వ జిల్లా కృష్ణా జిల్లాలో ప్రతిహతంగా ముందుకు సాగుతోంది. 180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఇప్పటివరకూ వైఎస్సార్ జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పాదయాత్ర పూర్తి అయ్యింది.