మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
'ప్రాణహిత' పైలాన్కు విజయమ్మ పాలాభిషేకం
21 May 2013 1:50 PM
తుమ్మిడిహెట్టి(ఆదిలాబాద్) 21 మే 2013:
ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ మంగళవారం మధ్యాహ్నం సందర్శించారు. తుమ్మిడి వద్ద భూమి పూజకు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ నెలకొల్పిన పైలాన్కు ఆమె పాలాభిషేకం చేశారు. మొక్కలు నాటారు. ఆమె పాలాభిషేకం చేస్తున్న సమయంలో జోహార్ వైయస్ఆర్, జై జగన్ అంటూ నినాదాలు వెల్లువెత్తాయి. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అంతకుముందు కౌటాలలో టోంకిని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూలే, కొమరం భీమ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.