పేదలు, బడుగుల పథకాలపై విస్తృత ప్రచారం

హైదరాబాద్‌ : వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికారంలోకి వస్తే పేద, బడుగు, బలహీన వర్గాలకు అందించే సంక్షేమ పథకాలు, ఇతర కార్యక్రమాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ‌పర్యటించి, ప్రచారం నిర్వహించాలని పార్టీ అనుబంధ విభాగం ప్రచార కమిటీ నిర్ణయించింది. వైయస్‌ఆర్‌ సిపిపై ఇతర పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని నిర్ణయం తీసుకుంది. ప్రచార కమిటీ సమన్వయకర్త టి.ఎస్.విజయచంద‌ర్ ‌ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు చేశారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లాలని ఈ సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం ‌టడిపి కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికొదిలేసిన వైనంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చ తీసుకురావాలని నిర్ణయించారు. పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన పలు అంశాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది.

ఈ సమావేశంలో కేంద్రపాలక మండలి సభ్యుడు ఎం.వి. మైసూరారెడ్డి, బిసి విభాగం రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావు, సీఈసీ సభ్యు‌డు కె.శివకుమార్, రాష్ట్ర ప్రచార కమిటీ అసిస్టెంట్ కో‌ ఆర్డినేటర్ జొన్నల శ్రీనివా‌స్‌రెడ్డి తదితరులు పాల్గొని సలహాలు, సూచనలు చేశారు.
Back to Top