పార్టీలోకి టిడిపి, సిపిఐ నాయకుల చేరిక

కొత్తగూడెం (ఖమ్మం జిల్లా) : పినపాక నియోజకవర్గ సిపిఐ, టిడిపి నాయకులు పలువురు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో‌ ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పినపాక నియోజకవర్గ సమన్వయకర్త పాయం వెంకటేశ్వర్లు, కేంద్ర పాలక మండలి సభ్యుడు చందా లింగయ్య దొర ఆధ్వర్యంలో శ్రీమతి షర్మిల వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

పినపాక మండల టిడిపి అధ్యక్షుడు రావుల సోమయ్య, తెలుగు యువత మండల ప్రచార కార్యదర్శి రావుల రవితో పాటు పినపాక మండలంలోని కరకగూడెం, భట్టుపల్లి, సమత్‌భట్టుపల్లిలకు చెందిన మరో 50 కుటుంబాలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. టిడిపి మండల నాయకులు ఉప్పర్ల రామారావు, బర్ల వెంకన్న, పోతిబోయిన సారయ్య, పూనెం శంకరయ్య, కొమరం లాలయ్య, తొలెం ఎర్రయ్య, దయ్యాల మల్లయ్య, డేగాల విజయ్, వీరగాని సమ్మయ్య, గొగ్గల రవి, ‌గొగ్గల స్వామి, కొమరం స్వామి, గొగ్గలి నరేందర్, వుప్పలి నాగే‌ష్, మిట్టపల్లి చందు, తొలెం రాంబాబు, గొసంగి శంక‌ర్, మోడెపు సాంబయ్య, జలగం ఐలయ్య తదిదరులు పార్టీలో చే‌రారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ చే‌సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శ్రీ జగన్‌తోనే సాధ్యమన్న విశ్వాసంతో తాము వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, అహ్మద్‌హుస్సేన్, పి. తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

‌సిపిఐ నాయకుల చేరిక :
పినపాక నియోజకవర్గానికి చెందిన పలువురు సిపిఐ జిల్లా నాయకులు శ్రీమతి షర్మిల సమక్షంలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు. పార్టీ పినపాక నియోజకవర్గ ఇ‌న్‌చార్జి పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా నాయకులు కైపు సుబ్బిరామిరెడ్డి, పసుపులేటి విజయలక్ష్మి తదితరులు పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి శ్రీమతి షర్మిల ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాకాలపాటి చంద్రశేఖ‌ర్, జిల్లా నాయకురాలు పాయం ప్రమీల పాల్గొన్నారు.
Back to Top