పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యం

గూడూరు (చిలకలపూడి) : గ్రామస్థాయిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వైయస్‌ఆర్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఉప్పాల రాము అన్నారు. మండల పరిధిలోని ఆకులమన్నాడు, పోసినవారిపాలెం, కప్పలదొడ్డి, కోకనారాయణపాలెం, ఘంటలమ్మపాలెం, లేళ్లగరువు గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను గ్రామస్థాయి నాయకులకు అందజేయటం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితా వారీగా పోలింగ్‌బూత్‌ల వారీ కమిటీలను ఏర్పాటు చేయాలని నాయకులకు సూచించటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనరు బొమ్ము గంగాప్రసాద్‌ (బాబు), ఎస్సీ సెల్‌ నాయకులు కారుమంచి కామేశ్వరరావు, వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు మేరుగుమాల వెంకటేశ్వరరావు, పెన్నేరు పిచ్చేశ్వరరావు, ఆకుల వీరాంజనేయులు, నాగాంజనేయులు, జి శివయ్య, చింతల శ్రీనివాస్, సిరివెళ్ల భాస్కరరావు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top