బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఏం ఉద్ధరించారని మహానాడులు
24 May 2016 5:19 PM
అనంతపురంః తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం ఉద్దరించారని మినీ మహానాడులు జరుపుకుంటున్నారని వైయస్సార్సీపీ అనంతపురం నగర అధ్యక్షులు గోపాల్ రెడ్డి నిలదీశారు. మినీ మహానాడుల పేరుతో ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత స్వామిరెడ్డితో కలిసి గోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మినీ మహానాడుల పేరుతో టీడీపీ నాయకులు రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకోవాలో ప్రణాళికలను రూపొందించుకుంటున్నారని ఆరోపించారు. మహానాడులో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించకుండా ..ప్రతిపక్ష నేతపై మాటల దాడి చేయడం నీచమన్నారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.