ఢిల్లీ: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఎన్నో ఉద్యమాలు చేసి దాన్ని సజీవంగా ఉంచారని ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి అన్నారు. హోదా సాధన కోసం వైయస్ఆర్ సీపీ ఎంపీలు నిరాహార దీక్షలకు కూర్చోవడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. హోదా సాధన కోసం వైయస్ఆర్ సీపీ పిలుపు మేరకు రాష్ట్రంలో రహదారుల దిగ్భంధం చేపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలుపుతూ.. బంద్లను విజయవంతం చేస్తున్నారన్నారు.