ఏపీకి ప్రత్యేక హోదానే ముఖ్యం



చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంతా ప్రత్యేక హోదా కావాలని కోరుతుంటే, చంద్రబాబుకు మాత్రం అసెంబ్లీ సీట్లు కావాల్సి వచ్చిందని ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు.  ఏపీకి ప్రత్యేక హోదా ముఖ్యమా..?అసెంబ్లీ సీట్లు ముఖ్యమా..? అని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. నరేంద్రమోడీ, చంద్రబాబుతో ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదని, ప్రజలందరూ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు తన కేసుల నుంచి తప్పించుకునేందుకు అసెంబ్లీ సీట్లు పెంచుకోవడానికే ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న చంద్రబాబుకు అసెంబ్లీ సీట్ల పెంపు ఒక్కటే సమస్యగా కనిపిస్తుందన్నారు. 

 
Back to Top