చిత్తూరు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో టీడీపీ నేతల్లో వణుకు పుడుతోందని వైయస్ఆర్సీపీ రైల్వే కోడురు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఆయన వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై అధికారులను నిలదీస్తుంటే తట్టుకోలేకపోతున్నారన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు తమ సమస్యలు వైయస్ జగన్కు చెప్పుకొని సంతోషçపడుతున్నారని, మీరు ముఖ్యమంత్రి అయితే మా బాధలు తీరుతాయని ప్రజలు నమ్ముతున్నారన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చెప్పినవి, చెప్పనివి కూడా చేశారని గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రైతులు సీఎం క్యాంపు ఆఫీస్, జన్మభూమి సభల్లో ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ చెప్పిన నవరత్నాలను ప్రజలు విశ్వసిస్తున్నారని కోరుముట్ల చెప్పారు. రాబోయేది రాజన్న రాజ్యమే అని విశ్వాసం వ్యక్తం చేశారు.