బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
రాజన్న రాజ్యాన్ని జగనన్న తెస్తాడు
13 Jan 2018 5:10 PM
చిత్తూరు: త్వరలో రాజన్న రాజ్యాన్ని వైయస్ జగన్మోహన్రెడ్డి తెస్తారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. రామచంద్రాపురం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసులో ఆధారాలతో దొరికిపోయిన చంద్రబాబు అమరావతికి పారిపోయారన్నారు. పురిటి బిడ్డను తీసుకొని వచ్చి కూడా మహిళలు వైయస్ జగన్ను కలిసి ఆనందపడుతున్నారన్నారు. అదే మన నాయకుడిపై ఉన్న నమ్మకమని చెప్పారు. పురిటి బిడ్డను కూడా అన్న కాపాడగలడన్న నమ్మకం వారిలో ఉందన్నారు. మనందరం కూడా వైయస్ జగన్ నాయకత్వంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పాత రోజులు మళ్లీ రావాలంటే, పాడి పంటలు విరజిల్లాలంటే వైయస్ జగన్ సీఎం కావాలన్నారు. భవిష్యత్తు మనదే అని, విజయం మనదే అని నినదించారు. రామరాజ్యం వస్తుందని చెవిరెడ్డి చెప్పారు.