బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యం
సీమాంధ్రను అగ్నిగుండంగా మార్చిన కాంగ్రెస్
15 Aug 2013 4:32 PM
తిరుపతి, 15 ఆగస్టు 2013:
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అగ్నిగుండంగా మారడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా గురువారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వినూత్న నిరసన కార్యక్రమంలో భూమన పాల్గొన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రజల కళ్లలో కాంగ్రెస్ పార్టీ కారం కొట్టిందని ఆగ్రహం వ్యక్తంచేస్తూ కారం పొట్లాలను భూమన పంపిణీ చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అవాంఛనీయ పరిస్థితులకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని ఈ సందర్భంగా మాట్లాడిన భూమన ఆరోపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన అభివర్ణించారు. శ్రీమతి విజయమ్మ దీక్ష ప్రకటనతో కాంగ్రెస్-టిడిపి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. శ్రీమతి విజయమ్మ నిరవధిక నిరశన దీక్షకు సీమాంధ్ర ప్రజలు మద్దతుగా ఉంటారని భూమన ధీమా వ్యక్తంచేశారు.