బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
రైతులకు ముఖం చాటేసిన మంత్రి గారు
22 Nov 2015 9:51 PM
గుంటూరు
జిల్లా ప్రత్తిపాడులో తాగునీరు, సాగునీటి
సమస్య తీవ్రంగా ఉంది. ప్రజాప్రతినిధులకు సమస్యలు చెప్పుకున్నా.. ఫలితం లేకుండా
పోతోందని ప్రజలు వాపోతున్నారు. మంత్రి రావెల కిషోర్ బాబు ప్రత్తిపాడు మీదుగా
పెదనందిపాడు వెళుతున్నారన్న సమాచారం తెలుసుకున్న స్థానికులు.. మంత్రి కిషోర్
బాబుకి తమ సమస్యలు చెప్పుకొందామని అనుకొన్నారు.
ఈ
లోగా అక్కడకు చేరుకొన్న పోలీసులు.. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకొనే ప్రయత్నం అంటూ
హడావుడి చేశారు. సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నామంటూ రైతులు
చెప్పుకొన్నారు. ఈ లోగా మంత్రి కిషోర్ బాబు కాన్వాయ్ దారి మళ్లించుకొని బైపాస్
రోడ్ మీదుగా వెళ్లిపోయారు. కనీసం ప్రజల అవసరాలు ఏమిటో తెలుసుకొనే ప్రయత్నం
చేయకపోవటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటలు పండక, సాగునీరు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా..
ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ అమలు కూడా
సరిగా జరగడం లేదని నిరసన తెలిపారు. చివరకు మంత్రి వెళ్లిపోయారన్న సమాచారం
తెలుసుకున్న రైతులు.. అక్కడ్నుంచి వెనుదిరిగారు.