రాబోయే కాలానికి కాబోయే సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌


* చంద్ర‌బాబు అవ‌కాశ‌వాది
* బాబు  ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మోసం చేశారు
* మ‌హానేత పాల‌న మ‌ళ్లీ రావాలంటే జ‌గ‌న్ సీఎం కావాల్సిందే

నెల్లూరు: మ‌హానేత వైయ‌స్ఆర్ త‌న‌యుడు, మ‌న నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాబోయే కాలానికి కాబోయే సీఎం అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి అన్నారు. ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా నెల్లూరు జిల్లా, ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం క‌లిగిరిలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గ‌మైన పాల‌న న‌డుస్తోంద‌న్నారు. బాబు పాల‌న‌లో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌న్నారు. చంద్ర‌బాబు అవ‌కాశ‌వాది అని పేర్కొన్నారు. 2014 ఎన్నిక‌ల ముందు ప్ర‌ధాని మోడీ హ‌వా బాగా న‌డుస్తోంద‌ని తెలుసుకున్న చంద్ర‌బాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నార‌ని గుర్తు చేశారు. రైతుల‌కు రుణాలు మాఫీ చేస్తాన‌ని చేయ‌లేద‌ని, ప్ర‌త్యేక హోదా తెస్తాన‌ని తేలేద‌ని, బాబు చెప్పిన ఏ ఒక్క‌టీ చేయ‌లేద‌ని ఇంత అబ‌ద్దాల కోరు దేశంలో ఎక్క‌డా ఉండ‌ర‌ని మేక‌పాటి దుయ్య‌బ‌ట్టారు.  చంద్ర‌బాబు రాష్ట్రంలోని ఉన్న 175 స్థానాల‌ను 225 స్థానాల‌కు పెంచుకుని త‌న ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూశార‌ని, దానికి మోడీకి ఒప్పుకోక‌పోవ‌డంతో ఆ పార్టీ నుంచి తెగ‌తెంపులు చేసుకోవాల‌ని చూస్తున్నార‌న్నారు. ప్ర‌త్యేక హోదా కోసం పార్ల‌మెంట్‌లో టీడీపీ ఎంపీలు ధ‌ర్నాలు చేయ‌కుండా డ్రామాలు చేశార‌న్నారు. మ‌న‌కు విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న‌వి, న్యాయంగా రావాల్సిన‌వి ప్ర‌త్యేక హోద‌, పోల‌వ‌రం ప్రాజెక్టు, విశాఖకు రైల్వే జోన్‌, దుగ‌రాజ‌ప‌ట్నం పోర్టు, క‌డ‌ప‌ స్టీల్ ప్లాంట్ వంటివి కూడా సాధించుకోలేక‌పోతున్నామ‌ని, దీనికి ముఖ్య కార‌కుడు కూడా చంద్ర‌బాబేన‌న్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మళ్లీ మంచి రోజులు రావాలంటే వైయ‌స్‌జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితేనే సాధ్య‌మ‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ఇస్తున్న హామీలు క‌చ్చితంగా ప్ర‌జ‌ల‌కు చేసి చూపిస్తాడ‌ని, వైయ‌స్ కుటుంబం మాట ఇస్తే మాట త‌ప్ప‌ద‌ని, మ‌న నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌ను మీరంద‌రూ ఆశీర్వ‌దించాల‌ని మేక‌పాటి ప్ర‌జ‌ల‌నుద్దేశించి అన్నారు.
Back to Top