పథకాలను తుంగలో తొక్కుతున్నారు: షర్మిల

కొరివిపాడు(మహబూబ్‌గర్):

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పథకాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా కొరివిపాడులో శుక్రవారం ఆమె ప్రజలతో మాట్లాడారు. కుట్ర చేసి జగనన్నను జైలులో పెట్టారని ఆమె ఆరోపించారు. తన హయాంలో 4వేల మంది రైతులను చంద్రబాబు పొట్టనబెట్టుకున్నారన్నారు. వైయస్ జగన్ బయట ఉంటే కాంగ్రెస్, టీడీపీకి తమ దుకాణాలు బంద్‌ అవుతాయని భయంతో కుట్రలు, కుత్రంత్రాలు పన్నుతున్నారని షర్మిల అన్నారు. అందుకే విచారణ పేరుతో జగనన్నను జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఉండగా  తెలంగాణలో షర్మిల పాదయాత్రకు జనం ఘనస్వాగతం పలుకుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ నేత కొండా సురేఖ చెప్పారు. చంద్రబాబు చేస్తున్న పాదయాత్రను ప్రజలెవరూ విశ్వసించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెలంగాణలో తమ పార్టీకి 60 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నాటి షర్మిల పాదయాత్రలో కొండా సురేఖ కూడా పాల్గొన్నారు.

Back to Top