బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
'మహానేత కుటుంబాన్ని విమర్శిస్తే సహించం'
03 Apr 2013 11:37 AM
హైదరాబాద్, 3 ఏప్రిల్ 2013: మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని విమర్శించే అర్హత టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి లేదని నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైయస్ కుటుంబంపై ఆరోపణలు చేస్తే ఊరుకునేదిలేదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు చరిత్ర మొత్తం చిత్తూరు ప్రజలకు బాగా తెలుసన్నారు. రెండు ఎకరాలు ఆసామి చంద్రబాబు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆయన మండిపడ్డారు. అసమర్థ, ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా కాపాడుతున్నది చంద్రబాబే అని ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు.
తొమ్మిదేళ్ళ పాలనలో ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ప్రసన్న కుమార్రెడ్డి విమర్శించారు. చంద్రబాబును రెండుసార్లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ప్రజలు మూడవసారి ఆ పదవిని కూడా పీకేయడం ఖాయమన్నారు. చంద్రబాబు అవినీతిని భరించలేకే తెలుగుదేశం పార్టీ నుంచి నేతలు బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ భవన్ను త్వరలో హెరిటేజ్ భవన్గా మార్చుకోక తప్పదని ప్రసన్న జోస్యం చెప్పారు.