వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
లక్షల ఎకరాలు దోచుకున్నారు
29 Aug 2018 5:18 PM
విశాఖ: విశాఖ జిల్లాలో భూ స్కాంలో వేలాది ఎకరాలు దోచుకున్నారని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగుడివాడ అమర్ నాథ్ రెడ్డి మండిపడ్డారు. అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యేకు కూడా ఈ స్కామ్లో భాగస్యామ్యం ఉందన్నారు. అలాంటి పాలకులు ఉండటం మన ధౌర్భగ్యమన్నారు. ఈ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలను, సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అన్ని సమస్యలకు వైయస్ జగన్ పరిష్కరిస్తారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న దుబారా ఖర్చులకు మన నుంచే వసూలు చేస్తున్నారన్నారు. సామాన్యులపై అక్రమ కేసులు పెట్టి, అనవసరంగా జరిమానాలు విధించి వసూలు చేస్తున్నారన్నారు. సింగపూర్ కడుతానని చెప్పిన చంద్రబాబు స్విమ్మింగ్ ఫూల్ కట్టించుకున్నారని ఎద్దేవా చేశారు. వైయస్ జగన్ ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పారు.