కాళహస్తిలో ప్రత్యేక పూజలు

తిరుపతి, 16 మే  2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రతో కాంగ్రెస్‌-టీడీపీ పార్టీలు బెంబేలెత్తుతున్నాయని శ్రీకాళహస్తి వైయస్ఆర్ కాంగ్రెస్ సమన్వయకర్త మధుసూదన్‌రెడ్డి చెప్పారు.  శ్రీమతి షర్మిల పాదయాత్ర పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా శ్రీకాళహస్తిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Back to Top