కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
'జగన్ కోసం..' 1,24,36,000 సంతకాలు
08 Jan 2013 8:48 AM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా చేపట్టిన ‘జగన్ కోసం.. జనం సంతకం’ కార్యక్రమానికి విశేషంగా ప్రజాదరణ వస్తోంది. పార్టీ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్, డి.ఎ. సోమయాజులు ఈ విషయం తెలిపారు. ఆదివారం నాటికి కోటి 24 లక్షల 36 వేల సంతకాలు పూర్తయ్యాయని వారు చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియాతో వారు మాట్లాడుతూ, ప్రజాదరణ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టిడిపిలతో కలిసి సిబిఐ చేస్తున్న నీచమైన కుట్రలను నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఈ సంతకాల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని బాజిరెడ్డి, సోమయాజులు తెలిపారు. త్వరలోనే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్మెంట్ తీసుకొని, ప్రజల నుంచి సేకరించిన సంతకాలను ఆయనకు అందజేయనున్నట్లు చెప్పారు.