మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
‘హంద్రీనీవా పూర్తయ్యే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తా’
30 Jan 2015 3:02 PM
అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ తన పోరాటాన్ని కొనసాగిస్తానని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలనే డిమాండ్తో విశ్వేశ్వరరెడ్డి బుధవారం దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఆయన 25 గంటల దీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. నిరాహార దీక్ష విరమించిన అనంతరం విశ్వేశ్వరరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆ ప్రాజెక్టుకు తక్షణం రూ. 100 కోట్లు కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ సోదరులు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు.