‘హంద్రీనీవా పూర్తయ్యే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తా’


అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ తన పోరాటాన్ని కొనసాగిస్తానని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలనే డిమాండ్‌తో విశ్వేశ్వరరెడ్డి బుధవారం దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఆయన 25 గంటల దీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. నిరాహార దీక్ష విరమించిన అనంతరం విశ్వేశ్వరరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఆ ప్రాజెక్టుకు తక్షణం రూ. 100 కోట్లు కేటాయించాల్సిందేనని  డిమాండ్ చేశారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ సోదరులు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు.
Back to Top