వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీ నేతలకు హైకోర్టు నోటీసులు
25 Apr 2017 1:57 PM
హైదరాబాద్: విజయవాడ రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీఏ) కమిషనర్పై దాడికి పాల్పడిన ఘటనలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఓ దినపత్రికలో వచ్చిన కథనాలను పిల్గా స్వీకరించిన హైకోర్టు కేసును సూమోటోగా స్వీకరించింది. దీనిపై మంగళవారం విచారణ జరిపింది.
ప్రతివాదులు 11 మందికి నోటీసులు జారీ చేసింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వర్ రావు, మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, ఏపీ డీజీపీ ,విజయవాడ సీపీల తదితరులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.