మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
'హెచ్ఎల్సీకి తక్షణమే సాగునీరు ఇవ్వాలి'
02 Dec 2012 2:18 PM
హైదరాబాద్, 2 డిసెంబర్ 2012: మరి కొద్ది రోజుల్లో పంటలు చేతికి రానున్న సమయంలో అనంతపురం జిల్లా రాయదుర్గంలోని హైలెవెల్ కెనాల్ (హెచ్ఎల్సి)కు అర్ధంతరంగా నీటిని నిలిపివేయడం దారుణమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, కిరణ్ ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఈ ప్రభుత్వం చర్యలు అన్నదాతలను ఆత్మహత్యలకు పురికొల్పే విధంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. హెచ్ఎల్సికి తక్షణమే సాగునీటిని సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కాపు రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.