మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
రైల్వే జోన్ సాధనకు గుడివాడ అమర్నాథ్ పాదయాత్ర
30 Mar 2017 11:37 AM
విశాఖ: విశాఖపట్టణం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాదయాత్ర ప్రారంభించారు.గురువారం అనకపల్లిలోని నెహ్రూ సెంటర్ నుంచి ‘ఆత్మగౌరవ యాత్ర’ను పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు ప్రారంభించారు. అనకాపల్లి నుంచి ప్రారంభం కానున్న యాత్ర జిల్లాలో మొత్తం 162 కిలోమీటర్ల మేర సాగనుంది. అన్ని వర్గాలను కలిసి రైల్వేజోన్ ఆవశ్యకతపై నాయకులు వివరించనున్నారు. 11 రోజులపాటు సాగే ఈ యాత్ర చివరి రోజు బోయిపాలెం, దొరతోట, భీమిలి మీదుగా సాగి చిట్టివలసలో ముగుస్తుంది.