పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
గొర్రెల కాపరుల కోసం 103: షర్మిల
14 Nov 2012 12:44 PM
కర్నూలు:
గొర్రెల కాపరుల కోసం ప్రత్యేకంగా 103 మొబైల్ వెటర్నరీ సర్వీసును ప్రవేశపెడతామని మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సో దరి అయిన వైయస్ షర్మిల చెప్పారు. 28వ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంలో గొర్రెల కాపరులతో పాటు వలస కూలీలు కూడా ఆమెను కలిశారు. తమతమ ప్రాంతాలలో పని లభించకనే హైదరాబాద్, బెంగళూరు నగరాలకు తరలి వెడుతున్నట్లు వారు ఆమెకు చెప్పారు. త్వరలో రాజన్న రాజ్యం వస్తుందనీ, మీకు మంచి రోజులు తథ్యమనీ ఆమె వారికి తెలిపారు. గొర్రెలకు మందులు, వైద్యం లభించక ఇబ్బంది పడుతున్నామని కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు.