బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
అప్పుల బాధలు తాళలేక కౌలు రైతు మృతి
26 Jun 2017 5:47 PM
నందికొట్కూరు: అప్పుల బాధలు భరించలేకనే కౌలు రైతు గుండెపోటుతో మృతి చెందడం జరిగిందని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని 10 బొల్లవరం గ్రామంలో బోయ రామకృష్ణ(36) మృతదేహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఐజయ్య నివాళ్లు అర్పించారు. కౌలు రైతులను ప్రభుత్వం విస్మరించడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కౌలు రైతులకు కార్డులిచ్చి అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కౌలు రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, బ్యాంక్ రుణాలు, సబ్సీడి విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందక, అప్పులు తీర్చలేక గుండెపోటుతో, ఆత్మహత్యలకు పాల్పడి మృతి చెందుతున్నా ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లు లేదని మండిపడ్డారు. రాజన్న రాజ్యాం వస్తే రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేయడం జరుగుతుందని చెప్పారు. ఈయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు కాంతారెడ్డి, నాగభూషణంరెడ్డి, తదితరులు ఉన్నారు.