చంద్ర‌బాబు పాపం.. రైతుల‌కు శాపం



అనంత పురం జిల్లాలో రైతు దంప‌తులు  ఆత్మ‌హ‌త్య చేసుకొన్నారు. వ్య‌వ‌సాయ‌, డ్వాక్రా రుణ మాఫీ కాక‌పోవ‌ట‌మే శాపం గా మారింది. గోరంట్ల మండ‌లం పుట్ల గుండ్ల పల్లికి చెందిన నంజిరెడ్డి, నంజ‌మ్మ దంప‌తులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. గ్రామంలో అంద‌రితో క‌లిసిపోయే వ్య‌క్తులుగా ఈ దంప‌తుల‌కు పేరు ఉంది. కొడుకు తీసుకొన్న వ్యవ‌సాయ రుణం మాఫీ కాక‌పోవ‌టం, కోడ‌లు తీసుకొన్న డ్వాక్రా రుణం మాఫీ కాక‌పోవ‌టం..అప్పుల వాళ్లు ఇంటి మీద ప‌డి వేధిస్తుండంతో ఈ నిర్ణ‌యం తీసుకొన్న‌ట్లు తెలుస్తోంది. క‌ష్టాల్లో ఉన్న కుటుంబానికి ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ నుంచి ఎటువంటి భ‌రోసా ఎదురు కాక‌పోవ‌టంతో ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Back to Top